2/17/09

కంది పొడి



కావలసిన పదార్ధాలు:

కంది పప్పు : పావు కిలో
పెసర పప్పు : అర్ధ పావు
సెనగ పప్పు : అర్ధ పావు
జీలకర్ర : రెండు స్పూన్లు
ఎండు మిర్చి : ఇరవై అయిదు
ఉప్పు: రుచికి తగినంత

తయారు చేసే విధానం :

ముందుగా గ్యాసు వెలిగించు కొని ఒక బాణీ పెట్టి అందులో కంది పప్పు, పెసర పప్పు మరియు సెనగ పప్పు ఒకదాని తరువాత ఒకటి దోరగా వేయించుకోవాలి. అన్ని పప్పులు కలిపి ఒక పళ్ళెములో పోసి చల్లార నివ్వాలి.

ఇప్పుడు మళ్ళీ గ్యాసు మీద బాణీ పెట్టి, నూనె లేకుండానే జీలకర్ర మరియు ఎండుమిర్చి ని కూడా వేయించుకోవాలి.


అలా వేయించుకున్న పప్పులు మరియు జీలకర్ర, ఎండుమిర్చిలను మిక్సీలో వేసి అందులో ఉప్పు కూడా కలిపి ( సుమారు మూడు స్పూన్లు ) మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసిన దానిని జల్లెడతో జల్లించుకోవాలి . జల్లెడలో మిగిలిన దానిని మళ్ళీ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మొత్తం మెత్తటి పొడి వచ్చేదాకా గ్రైండ్ చేసుకోవాలి. అంతే కంది పొడి తయారు అయినట్టే .....అలా తయారైన పొడిని ఒక గట్టి మూత ఉన్న డబ్బాలో పోసుకొని నిలువ చేసుకోవాలి......

No comments:

Post a Comment