7/17/09

సగ్గుబియ్యం వడలు


కావలసిన పదార్ధాలు:

సగ్గుబియ్యం : పావు కిలో
బంగాళా దుంపలు: మూడు
పచ్చిమిర్చి : అయిదు లేక ఆరు
కొత్తిమీర: ఒక కట్ట
కరివేపాకు: రెండు రెబ్బలు
జీలకర్ర: ఒక చెంచా
వేరుశనగ పప్పు లేదా పల్లీలు : రెండు గుప్పెళ్ళు
ఉప్పు : రుచికి తగినంత
నూనె : వేయించటానికి సరిపడా

తయారు చేసే విధానం:
ముందుగా సగ్గుబియ్యం రెండు గంటల పాటు నానబెట్టుకోవాలి. బంగాలదుంపలు చెక్కు తీసి ఉడకబెట్టుకోవాలి. ఉడికినవాటిని మెత్తటి ముద్దలాచేసి పక్కన పెట్టుకోవాలి. వేరుసెనగపప్పు వేయించుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి . పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. కరివేపాకు, కొత్తిమీర కూడా సన్నగా తరిగి పెట్టుకోవాలి.
సగ్గుబియ్యం నానాకా నీళ్లు ఏమైనా మిగిలితే తీసెయ్యాలి. ఇప్పుడు నానిన సగ్గుబియ్యాన్ని ఒక గిన్నెలో తీసుకోవాలి.అందులో ఇందాక మనం ముద్ద చేసిపెట్టుకున్న బంగాళా దుంపల మిశ్రమాన్ని కలపాలి. అలాగే వేరుసెనగపప్పుపొడిని, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర మరియు ఉప్పు వేసిఅన్నిటిని బాగా కలుపుకోవాలి.

ఇప్పుడు గ్యాస్ మీద ఒక బాణీ పెట్టుకొని అందులో తగినంత నూనె పోసికాగనివ్వాలి. ఇప్పుడు ఒక పాలిథిన్ కవర్ కాని అరటి ఆకు కాని తీసుకొని సగ్గుబియ్యం మిశ్రమాన్ని తీసుకొని వడలాగా వత్తుకోవాలి.

వడని కాగుతున్న నూనెలోవేసి దోరగా వేయించుకోవాలి.

ఎంతో
రుచిగా కరకరలాడే సగ్గుబియ్యం వడలు తయారు అయినట్టే.

నేను ఈవంటకాన్ని ఈనాడు పేపర్లో చూసి ట్రైచేశాను...చాల బాగా వచ్చాయి....మీరూ తప్పక ట్రై చెయ్యండి మరి....వానాకాలం లో సాయంకాలం పూట వడలు చేసుకుంటే చాల బాగుంటుంది కదా....??
















2 comments: