
కావలసిన పదార్ధాలు :
పండు మిరపకాయలు : అర కిలో
మెంతులు : ఒక టేబుల్ స్పూను
చింతపండు : ఒక నిమ్మకాయ అంత
ఉప్పు : రుచికి తగినంత ( సుమారు యాభై గ్రాములు )
బెల్లం : రెండు టేబుల్ స్పూన్లు
నూనె : రెండు టేబుల్ స్పూన్లు
ఇంగువ : అర స్పూను
తయారు చేసే విధానం :
ముందుగా మిరపకాయల ముచికెలు తీసి శుభ్రం చేసుకొని తడి పోయేవరకు ఎండలో పెట్టుకోవాలి.

తరువాత మిరపకాయలను మిక్సీలో వేసి చెక్క ముక్క గ్రైండ్ చేసుకోవాలి. తరువాత దానికి చింతపండు కలుపుకోవాలి ( చింతపండులో గింజలు లేకుండా చూసుకోవాలి ) .

ఈ మిశ్రమాన్ని రెండు రోజులు మూతపెట్టి ఊరనివ్వాలి. తరువాత మళ్లీ మిక్సీలో వేసి ఈసారి బాగా పేస్టు లాగా గ్రైండ్ చేసుకోవాలి.



పండు మిరపకాయ పచ్చడి రెడీ......పచ్చడి చూడటానికి అంత ఎర్రగా ఉన్నా రుచి మాత్రం చాల కమ్మగా ఉంటుంది సుమా.....
No comments:
Post a Comment