1/19/09

పండు మిరపకాయ పచ్చడి



కావలసిన పదార్ధాలు :


పండు మిరపకాయలు : అర కిలో
మెంతులు : ఒక టేబుల్ స్పూను
చింతపండు : ఒక నిమ్మకాయ అంత
ఉప్పు : రుచికి తగినంత ( సుమారు యాభై గ్రాములు )
బెల్లం : రెండు టేబుల్ స్పూన్లు
నూనె : రెండు టేబుల్ స్పూన్లు
ఇంగువ : అర స్పూను

తయారు చేసే విధానం :
ముందుగా మిరపకాయల ముచికెలు తీసి శుభ్రం చేసుకొని తడి పోయేవరకు ఎండలో పెట్టుకోవాలి.


తరువాత మిరపకాయలను మిక్సీలో వేసి చెక్క ముక్క గ్రైండ్ చేసుకోవాలి. తరువాత దానికి చింతపండు కలుపుకోవాలి ( చింతపండులో గింజలు లేకుండా చూసుకోవాలి ) .

ఈ మిశ్రమాన్ని రెండు రోజులు మూతపెట్టి ఊరనివ్వాలి. తరువాత మళ్లీ మిక్సీలో వేసి ఈసారి బాగా పేస్టు లాగా గ్రైండ్ చేసుకోవాలి.
ఇప్పుడు మెంతులు తీసుకొని ఒక బాణిలో వేసి బాగా వేయించుకోవాలి. వాటిని మిక్సీ లో వేసి బాగా గ్రైండ్ చేసుకోవాలి, పౌడర్ లాగా.
ఇప్పుడు ఆ మెంతి పొడిని, బెల్లాన్ని మరియు సరిపడా ఉప్పుని మిరపకాయల పేస్టు లో వేసి బాగా కలుపుకోవాలి. బెల్లం వద్దనుకున్నవాళ్ళు వేసుకోవడం మనేయ్య వచ్చు. ఇప్పుడు ఒక బాణీ తీసుకొని పొయ్య మీద పెట్టి నూనె పోసుకోవాలి. బాగా కాగాక అందులో ఇంగువ వేసుకోవాలి. ఇప్పుడు గాస్ ఆపు చేసి నూనె బాగా చల్లారాక పచ్చడిలో పోసి కలుపుకోవాలి.

పండు మిరపకాయ పచ్చడి రెడీ......పచ్చడి చూడటానికి అంత ఎర్రగా ఉన్నా రుచి మాత్రం చాల కమ్మగా ఉంటుంది సుమా.....

No comments:

Post a Comment